జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 04 at 7.05.04 AM

TRINETHRAM NEWS

కిడ్నీ ఎలా పనిచేస్తుంది?
శరీరంలోని ప్రధాన అవయవాల్లో కిడ్నీలు కూడా ముఖ్యమైనవి.

అవి శరీరంలో కాల్షియం, సోడియం, పొటాషియం వంటి మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌ సమతుల స్థాయిలో ఉండేలా చేస్తాయి.

ఎర్ర రక్తకణాల నిర్మాణంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలోని యాసిడ్ బేస్ (పీహెచ్) లెవెల్స్‌ సమతౌల్యాన్ని కాపాడతాయి. అలాగే, శరీరంలోని వ్యర్థాలను ద్రవ రూపంలో బయటికి పంపుతాయి.

శరీరంలో రక్తం శుద్ధి జరిగే ప్రక్రియలో గ్లూకోజ్, లవణాలు, నీటిని కిడ్నీల ద్వారా రక్తకణాలు శోషించుకుంటాయి.

శుద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత నరాల ద్వారా రక్తం శరీరం మొత్తం సరఫరా అవుతుంది.

శరీరంలో నీటి నిల్వలను కిడ్నీలు సమతౌల్యం చేస్తాయి.

డయాబెటిస్, రక్తంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతుంది. అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయొచ్చు.

డయాబెటిస్ రోగుల్లో దాదాపు 40 శాతం మంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు.

You cannot copy content of this page