కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్ట్ 02 : నేటి విద్యార్థిని విద్యార్థులకు మన సనాతన ధర్మం యొక్క చరిత్ర మరియు వాటి యొక్క విలువలు తెలిసేలా తీయబడిన చిత్రం హరిహర వీరమల్లు. స్థానిక బాలనగర్ విమల్ థియేటర్ లో ఈ చిత్ర ప్రదర్శన పలువురు విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ప్రదర్శనకు ముందు విద్యార్థిని విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది .
ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన కూకట్పల్లి ఇన్చార్జి ప్రేమ్ కుమార్ మరియు హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేముల మహేష్, గడ్డం నాగరాజు, కలిగినీడి ప్రసాద్, సలాది శంకర్, సునీల్ అడబాల షణ్ముఖ్, పోలిబోయిన శ్రీనివాస్, గడ్డం వీర, ఆత్మూరి మోహన్, పులగం సుబ్బు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


