WhatsApp Image 2024 01 26 at 4.59.16 PM
తాడేపల్లి
రాష్ట్ర విపత్తుల కార్యాలయం ఎదుట ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
శుక్రవారం ఘనంగా జరిగాయి. విపత్తుల సంస్థ ఎండి,ఈడి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సిబ్బందికు, స్థానిక ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈడి డా.సి.నాగరాజు మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. కానీ 1950 వరకు బ్రిటీషర్స్ తయారు చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఆధారంగానే చట్టాలు నడిచేవి. డా.బి.ఆర్.అంబేద్కర్ సారథ్యంలో తయారు చేసిన రాజ్యాంగం జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. ఈ గొప్ప విజయాన్ని రిపబ్లిడేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని తెలిపారు.
