
త్రినేత్రం న్యూస్ : Mar 17, 2026, తెలంగాణ : రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి సీతక్క మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. మేడారం జాతర సందర్భంగా 565 మంది మహిళలకు రూ.6 కోట్లతో దుకాణాలు ఏర్పాటు చేయించగా, వారు 15 రోజుల్లోనే రూ.3.33 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించారని ఆమె వివరించారు. ఈ స్ఫూర్తితో మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె అన్నారు.

