జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 16 at 22.58.47

TRINETHRAM NEWS

Good news for people of AP

Trinethram News : Andhra Pradesh : ఏపీ ప్రజలకు శుభవార్త….ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.. కీలక నిర్ణయాలకు ఆమోదం..సీఎం ఆమోదం

సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అలాగే నూతన ఇసుక విధానంపైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కొత్త ఇసుక పాలసీకి, పౌరసరఫరాల శాఖకు రెండు వేలకోట్ల రుణానికి ప్రభుత్వం నుంచి గ్యారెంటీ ఇచ్చే అంశాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం వ్యవసాయ, సహకార కార్పొరేషన్ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

ఎన్సీడీసీ నుంచి 3,200 కోట్లు రుణం తీసుకునేందుకు ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇచ్చే ప్రతిపాదనలకు మంత్రివర్గ భేటీలో ఆమోదముద్ర వేశారు.

మరోవైపు జులై 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలరోజులు పూర్తైన నేపథ్యంలో.. నెలరోజుల పనితీరుపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఇక కేబినెట్ భేటీ ముగిశాక.. సీఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగానే ఉచిత ఇసుక విధానం గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వం ఇటీవలే నూతన ఇసుక విధానాన్ని ప్రారంభించింది. లోడింగ్, ట్రాన్స్ పోర్ట్ వంటి ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ ఉచితంగా ఇసుకను అందిస్తోంది. అయితే నూతన ఇసుక పాలసీలో జోక్యం చేసుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దంటూ మంత్రులకు చంద్రబాబు సూచించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విషయంలో జోక్యం చేసుకోవద్దని కేబినెట్ భేటీ అనంతరం వారికి స్పష్టం చేశారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచ్‌లన్నీ అందుబాటులోకి వస్తాయన్న సీఎం చంద్రబాబు నాయుడు.. బోట్‌ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందనే విషయాన్ని గ్రహించి మంత్రులు పనిచేయాలని చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రులకు కేటాయించిన శాఖల మీద ప్రతి నెలా సమీక్షలు చేయాలని.. ఎప్పటికప్పుడు తమ శాఖల పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలని మంత్రులకు సూచించారు

మరోవైపు పంటల బీమా పథకంపైనా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతులను మోసం చేసిందన్న చంద్రబాబు.. ఈసారి అలాంటి తప్పులు లేకుండా చూడాలని మంత్రులకు సూచించారు. ఇందుకోసం ముగ్గురు మంత్రులతో పంటలబీమా పథకం అమలుపై కమిటీ వేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగానే ఢిల్లీ పర్యటన గురించి కూడా చంద్రబాబు ప్రస్తావించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for people of AP

You cannot copy content of this page