వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ లొ జీతాలు,ఏరియర్స్ ఇవ్వాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలి. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ESI దవాఖాన ఏర్పాటు చెయ్యాలి. పని ప్రదేశంలో గాయపడిన వారికి దవాఖాన ఖర్చులు ఇవ్వాలి, ప్రమాద వశాత్తూ చనిపోయినవారి కుటుంబాలకు 10లక్షలు ఎక్సైగేసియా ఇవ్వాలి. 60మంది కార్మికులకు ఏడాది జీతం ఇవ్వాలని, ఈ నెల 20నా జరిగే దేశవ్యాప్త సమ్మె ను జయప్రదం చెయ్యాలి అని నేడు వికారాబాద్ మున్సిపల్ కార్మికులు పని ప్రదేశంలో నిరసన వ్యక్తం చేస్తూ కరపత్రం విడుదల చెయ్యడం జరిగింది సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్, కార్మికులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


