వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ప్రతి గ్రామంలో సర్వే చేయాలి.
వెరిఫికేషన్ లిస్టులో 80 శాతం పైగా అనర్హులకు, కాంగ్రెస్ నాయకుల పేర్లు.
ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను గుర్తించడంలో అధికారులు సరైన నిబంధనలు పాటించండి. నిజంగా ఇల్లు లేని పేదవాళ్లను గుర్తించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కెవిపిఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాయల్ నవీన్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్లు జాబితాను నిజమైన నిరు పేదలకు, ఇల్లు లేని వారందరికీ సొంత ఇంటి స్థలం ఉండి ఇతరుల ఇండ్లలో ఇంటి అద్దెకు ఉంటున్న వారికి ఓకే ఇంటిలో ఉమ్మడిగా ఉన్న కుటుంబాలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి అన్నారు.ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక మంది పేదలు అనేక సంవత్సరాలు నుండి ఇల్లు నిర్మాణం చేసుకోవాలి ఉన్న అనేక మందికి ఆర్థికంగా సహాయం లేకపోవడంతో ఇండ్లు నిర్మాణం చేసుకోలేరు అని తెలిపారు.
నిరుపేదలకు ఇల్లు కేటాయించకుండా కాంగ్రెస్ లీడర్లకే ఇందిరమ్మ ఇండ్లు .. కేటాయించాడా న్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


