Trinethram News : న్యూ ఢిల్లీ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి (52వ)గా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. సీజేఐగా ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్ గవాయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, మహారాష్ట్రలోని అమరావతికి చెందిన గవాయ్ 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.1987 నుండి 1990 వరకు ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా పని చేశారు. 2019లో సుప్రీంకోర్టుకు ప్రమోట్ అయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


