Chandana Nageshwar : మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్

TRINETHRAM NEWS

మరియు రాజానగరం వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)

చందన నాగేశ్వర్

మురమండ తేది. ..07.10.2025. చదువు నిమిత్తము పేద విద్యార్థికి.. ఆర్థిక సహాయాన్ని అందించిన….చందన నాగేశ్వర్* పేద విద్యార్థి ,విద్యార్థినీలకు 20,000 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్ అందజేశారు. మురమండ గ్రామం వివర్స్ కాలనీ చెందిన చందన శ్రీనివాస్ కు ఇద్దరు కవల పిల్లలు చందన రాము ,చందన లక్ష్మి లహరి స్థానిక రాజమండ్రి కాలేజీలో డిగ్రీ విద్యను చదువుతున్నారు. చందన శ్రీనివాస్ కు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వలన చదువును తన ఇద్దరు కవల పిల్లలకు చదువు నిలిపివేస్తామని తెలపడంతో ఈ విషయం తెలుసుకున్న మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, విద్యార్థిల స్థితి తెలుసుకొని చందన నాగేశ్వర్ వెంటనే స్పందించి విద్యార్థి కీ చదువు నిమిత్తం 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని విద్యార్థినీల తండ్రికి అందజేశారు. విద్యార్థి చందన రాము , చందన లక్ష్మి లహరి చదువులలో ముందుంటారని , అత్యధిక మార్కులు కూడా కాలేజీలో నిర్వహించే పరీక్షలలో సంపాదించుకుంటారని చందన నాగేశ్వర్ తెలిపారు. ఇద్దరు కవల పిల్లలకు ఆర్థిక సహాయం అందించడంతో పలువురు మురముండ వైఎస్ఆర్సిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మురముండ వైఎస్ఆర్సిపి అయినవిల్లి వెంకటేశ్వర్లు, కొప్పాక రమణ, పైడిమాల సురేష్, దైవపు భూరయ్య, దొంతం శెట్టి నాగేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former State Greening and Beautification Corporation Chairman

You cannot copy content of this page

Scroll to Top