Trinethram News : Nov 25, 2025, తెలంగాణ : హైదరాబాద్ శాలిబండలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ షో రూంలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఎలక్ట్రానిక్ వస్తువులు పేలిపోతున్నాయి. ప్రమాద సమయంలో సిబ్బంది షాపులోనే ఉండటంతో పలువురికి గాయాలయినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. 8 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


