కాల్వశ్రీరాంపూర్ పెద్దపల్లి మే-21// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. కాల్వశ్రీరాంపూర్ లో మామిడికాయ పచ్చడి పెట?ట్ట విషయంలో తలెత్తిన గొడవలో భార్యను గొంతు నులిపి చంపాడు భర్త. ఈ ఘటన పందిళ్ల గ్రామంలో జరిగింది పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన సూర అంజలి సూర రాజ్కుమార్ దంపతులు వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆదివారం సాయంత్రం మామిడికాయ పచ్చడి పెట్టేందుకు అంజలి సన్నద్ధమైంది.
అవసరమైన వెల్లుల్లి కొనుక్కు రావాలని భర్త రాజ్ కుమార్ సూచించింది ఈ విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్ అంజలి(27)ను గొంతు నులిమి చంపేశాడు ఈమెరకు మృతురాలి తండ్రి సంపంగి మల్లేశ్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శవాన్ని పరిశీలించిన పోలీసులు ఆసుపత్రికి చికిత్స. మృతురాలి భర్త రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


