త్రినేత్రం న్యూస్ : ఎమ్మెల్యే, నల్లమిల్లి మాట్లాడుతూ… కంటిన్యూస్ గా రెండు జిల్లాల కలెక్టర్లు, జాయింటు కలెక్టర్లు, సివిల్ సప్లయ్ అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ రైసుమిల్లుల నుండి ఇబ్బందులు తలెత్తినా వెంటనే వారికి తెలియజేయండి.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఉనికి కోల్పోయిన నాయకులు సోలో వీడియోలు చేసుకుని మాట్లాడే విషయాలు ఎవరికీ సంబంధం లేదు. గత ఐదేళ్ళలో కాలువల్లో తూడు కూడా తొలగించలేని నాయకుడు ఈరోజు ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడటం హాస్యాస్పదం,
నాడు సొంత తోడల్లుడిని రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షునిగా పెట్టి బస్తాకు 300-400 తక్కువకు కొని సొమ్ము చేసుకున్న వ్యక్తికి నేడు నా గురించి గానీ కూటమి ప్రభుత్వం గురించి గానీ మాట్లాడే అర్హత లేదు.
రైతుకు సంక్షోభం రాకుండా ఉండేందుకు మేం కృషి చేస్తున్నాం. రైతుకు మద్దతు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


