తేదీ : 17/04/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అనకాపల్లిలో రైతు ఆందోళన చేపట్టడం జరిగింది. అచ్చుతాపురం మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు భూ రికార్డులు తారుమారు చేశారని ఆరోపిస్తూ నిరసనకు దిగాడు.
సెల్ టవర్ ఎక్కి పెట్రోల్ ఒంటిమీద పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ సమస్యపై ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు రైతును కిందకు దింపేందుకు ప్రయత్నించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


