CPI : మత సామరస్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి

TRINETHRAM NEWS

ఏసుక్రీస్తు కూడా సామాజిక విప్లవ కారుడే

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు

పలు క్రిష్మస్ వేడుకల్లో పాల్గొన్న మధు

రాజమండ్రి, డిసెంబర్ 25: ప్రపంచ దేశాలలో అన్ని పండగలు జరుపుకునే రోజు డిసెంబర్ 25 క్రిస్టమస్ వేడుక అని నేటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు మత సామరస్యానికి కట్టుబడి ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిలుపునిచ్చారు

గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు క్రిస్టమస్ వేడుకల్లో మధు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు అనేక సమస్యల పై ఆనాడు చక్రవర్తులపై ఏసుక్రీస్తు పోరాటం చేశారని ప్రజలకు శాంతి సందేశం ఇచ్చారని ఆయన అన్నారు నేటి పరిస్థితులలో పాలకులు ప్రజల్ని అశాంతి ని రెచ్చకొడుతున్నారని మండిపడ్డారు దేవుడు లో ఇరుగు పొరుగు వుండడని ఎవరి నమ్మకం వారిది అని ఆయన అన్నారు భారత దేశం లౌకిక రాజ్యంగా వుందని ఈ భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు కలిగిన దేశం అని ఆయన అన్నారు ప్రజాస్వామ్యం, లౌకిక రాజ్యం కోసం మీరందరూ కలిసికట్టుగా సిపిఐ తో కలిసి నడవాలని మధు కోరారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Everyone should respect religious harmony

You cannot copy content of this page

Scroll to Top