దైవ చింతనతో మానసిక ప్రశాంతత.
కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి . —-నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ మాజీ ఛైర్మన్ చింతపల్లి మాజీ జడ్పీటిసి.
దేవరకొండ (చింత పల్లి) సెప్టెంబర్ 29 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలోని ముత్యాలమ్మ, పెద్దమ్మ తల్లి దేవాలయాలలో కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి ఘనంగా అభిషేకాలు,పూజ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ….దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కల్గి ఉండాలి ఆయన అన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని తెలిపారు.ప్రజలందరూ ముత్యాలమ్మ,పెద్దమ్మ తల్లి కృపతో సకల సౌభాగ్యాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దెంది వినోదమ్మ జంగారెడ్డి,బిఆర్ఎస్ పార్టీ నాయకులు నక్కనమోని పరమేష్,సిమర్ల కృష్ణ యాదవ్,అనంతుల శ్రీకాంత్, నక్కనమోని లక్ష్మణ్, నక్కనమోని మల్లేష్ ,శివర్ల శ్రీను,వరికుప్పల శివ,అల్వాల జంగయ్య,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


