TRINETHRAM NEWS

Trinethram News : ఏపీ లో ఫిబ్రవరి 2న ఎలక్షన్ కోడ్?

మార్చి 6న ఎన్నికలు

3 కోట్ల 69 లక్షల మంది ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల కోడ్ ప్రకటించే అవకాశం ఉంది. మార్చి 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచారు. ఏపీలో విమర్శలు ప్రతి విమర్శలు మధ్య ఎన్నికల సంఘం నూతన ఓటర్ల లిస్టు తయారుచేసింది. తన కార్యక్రమాలు ముమ్మరం చేసింది.

ఇక ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు వున్నట్లు తెలుస్తుంది.