MLA Jare : ఇందిరమ్మ బడి బాటతో విద్యా వెలుగులు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ 22.04.2025 – మంగళవారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట, నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి. కాంగ్రెస్, పార్టీ పునాది వేస్తోంది. ఇందిరమ్మ, బడిబాట కార్యక్రమం ద్వారా మంజూరైన అమ్మ, ఆదర్శ పాఠశాల నిధులను సద్వినియోగం చేస్తూ, పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం టాయిలెట్లు స్మార్ట్ క్లాస్‌ రూముల, ఫర్నిచర్ క్రీడా పరికరాలు వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నారు.
ఈ సందర్భంలో అన్నపురెడ్డిపల్లి మండలం. గుంపెన ఎర్రగుంట ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి. పూర్తికాబడ్డ వసతులను, శాసనసభ్యులు జారే ఆదినారాయణ.ఘనంగా ప్రారంభించారు, అనంతరం విద్యార్థుల తో నేషనల్ ఎర్త్ డే సందర్భం గా ప్రకృతి పరిరక్షణ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అలాగే, కిచెన్ గార్డెన్ పరిశీలించి. ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు. ఇందిరమ్మ బడిబాట గురించి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే, పాఠశాలల అభివృద్ధి తప్పనిసరని.
మన పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు పోకుండా ప్రభుత్వ పాఠశాలల కే, ప్రాధాన్యం ఇవ్వాలన్నదే మా లక్ష్యం అని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా అనారోగ్యం తో ఇబ్బంది పడుతున్న పలువురిని పరామర్శించి మెరుగైన చికిత్స అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామశాఖ, కార్యవర్గ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Educational lights with the

You cannot copy content of this page

Scroll to Top