
Donation : దేవరకొండ డివిజన్ ,జూన్ 15,త్రినేత్రం న్యూస్. దేవరకొండ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం సోమవారం అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన నిర్వహించారు .ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు తాడిశెట్టి నరసింహ , చంద్రమౌళి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షనర్లకు 5 విడతల కరువు భత్యం ,విడుదల చేయకపోవడం, 20 23లో అమలు చేయవలసిన పే రివిజన్ కమిషన్ అమలు చేయకపోవడం ,హెల్త్ కార్డులు పనిచేయకుండానే మే నెల పెన్షన్ నుండి 1.5 శాతం కోత విధించడం బాధాకరమని వారన్నారు.
అనంతరం జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణరెడ్డి 50,000 రూపాయలు గుంజ సుమాల భర్త గుంజ కృష్ణయ్య జ్ఞాపకార్థం 10,000 రూపాయలు, గంధం వసంత తన భర్త శ్రీనివాసులు జ్ఞాపకార్థం 5,000 రూపాయలు కోశాధికారి పంగులూరు లింగయ్యకు అందజేసినారు.సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య 5,000 రూపాయలు విరాళం ప్రకటించారు.అనంతరం గుంజ సుమాల ఫ్యామిలీ పెన్షనర్ 65వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.అనంతరం ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ హాజరైన కార్యవర్గ సభ్యులకు, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe