Collector Koya : బయోమెట్రిక్ విధానం ద్వారా వైద్య సిబ్బంది హాజరు నమోదు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

మంథని మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్

మంథని , జూలై-29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంథని మండలంలో విస్తృతంగా పర్యటించారు. మంథని పట్టణ కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు ఆసుపత్రి, గోపాల్ పూర్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గద్దెలపల్లి గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు ఆసుపత్రిలో వార్డులను క్షుణ్ణంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగుల కొరకు నూతనంగా నిర్మించిన షెడ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,  ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు సకాలంలో విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు తప్పనిసరిగా హాజరు వివరాలను బయోమెట్రిక్ విధానం ద్వారా నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్య సేవలను గర్భిణీ మహిళలకు అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు గోపాల్ పూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అన్నారు. గద్దెలపల్లి ప్రాథమిక ఆసుపత్రిని పరిశీలించి ఏ.ఎం.సి ప్రొఫైల్ సక్రమంగా నిర్వహించాలని, ఎన్ .సి .డి స్క్రీనింగ్, ఎక్స్ రే .టి.బి. ముక్త్ భారత్ మరియు ఆరోగ్య మహిళ తదితర వాటిపై ఆరా తీశారు. ఓ.పీ సేవలు పెంచాలని కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఎం.పీ.డీ.వో. శశికళ, మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజశేఖర్, ఏ.ఈ.పి.ఆర్. అనుదీప్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector Koya Sri

You cannot copy content of this page

Scroll to Top