డిండి (గుండ్లపల్లి) మే 2 త్రినేత్రం న్యూస్. బుధవారం రోజు వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాలలో డిండి మండల విద్యార్థుల మెరుగైన ఫలితాలు సాధించారని మండల విద్యాధికారి గోపియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో మొత్తం 399 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో374 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినారని తెలిపారు.
మండలంలోని ఆదర్శ 96పాఠశాలలో96 మందికి 91 మంది ఉత్తీర్ణులు అయినట్లు ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి తెలిపారు మండల టాపర్ గా ఆదర్శ పాఠశాల విద్యార్థినీలు ఆర్ ఘనకీర్తి 549 మార్కులు సాధించగా, ద్వితీయంగా ఎండి ఫాతిమా 541 మార్కులు సాధించినట్లు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


