Korukanti Chander : బిఆర్ఎస్ రజతోత్సవ సభకు దళితబంధు లబ్ధిదారుల 2 లక్షల విరాళం

TRINETHRAM NEWS

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రం లో ప్రజలంతా తిరిగి కేసీఆర్‌ పాలన కోరుకుంటున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ 25 వ రజతోత్సవ భారీ బహిరంగ సభ కోసం దళిత బంధు లబ్ధిదారులు తమ సొంత డబ్బులు పార్టీకి 2 లక్షలు విరాళం జిల్లా పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ చెక్కు అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ కెసిఆర్ రే మళ్లీ సియం గా రావాలని స్వచ్ఛందంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్‌ పదేళ్ల పాలనలో సకల వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు. దళితులు జీవితాల్లో వెలుగులు దేశంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా దళితబంధు పధకం అమలు చేసిన ఘనత తొలి సిఎం కేసీఆర్‌ గారిదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ పాముకుంట్ల భాస్కర్, నాయకులు నీరటీ శ్రీనివాస్.చింటూ,శ్రవణ్,కొర్రీ ఓదెలు.కోడి రామకృష్ణ.అయిత నాగరాజు.రొడ్డ లక్ష్మి. శాంతలక్ష్మి. హరికృష్ణ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dalit Bandhu beneficiaries donate

You cannot copy content of this page

Scroll to Top