- గ్రామాలలో శాంతి భద్రతలను కాపాడాలి.
- సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేయాలి.
- దేవరకొండ డీ ఎస్ పి ఎం వీ శ్రీనివాస రావు.
డిండి (గుండ్ల పల్లి) జనవరి 10 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు మరియు ఉపసర్పంచ్ లకు దేవరకొండ డిఎస్పి శ్రీనివాసరావు మరియు ఎస్సై బాలకృష్ణ ఆధ్వర్యంలో నేరాల నియంత్రణ సీ సి టీవీ కెమెరాల అవగాహన సమావేశం స్థానిక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసి గ్రామాలలో శాంతి భద్రతలు కాపాడాలని, అభివృద్ధి పనులు చేయాలని, మీ మీ గ్రామాలలో ఏమైనా సమస్యలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలు పరిష్కరించుకోవాల్సిందిగా సూచనలు చేయడం జరిగింది. సర్పంచులు అందరూ సిసి టీవీ కెమేరాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు మరియు ఉపసర్పంచులు, పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


