WhatsApp Image 2023 12 28 at 12.34.21 PM
ప్రజాపాలన దరకాస్థుల కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లోని 16వ వార్డు కుమ్మరి సంగం నందు ఏర్పాటు చేసిన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు కూడా మహాలక్ష్మి, రైతు భరోసా, గృహలక్ష్మీ, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత వంటి ప్రభుత్వ పథకాలను జనవరి 6వ తారీకు లోపు ధరకాస్తు చేసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ AE ప్రవీణ్ మరియు సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
