కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 13: 124 ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్ పరిధిలోని నాగమ్మ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న భూగర్భ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, కాసాని శంకర్, దాతి రమేష్, వెంకట్రావు, కటికరవి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


