Rythu Nestham : రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ది 16/06/25 రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రైతు నేస్తం జగన్నాధపురం రైతు వేదిక లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు వారు మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చుపెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అన్నారు. తొమ్మిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి కి వ్యవసాయ శాఖ మంత్రికి ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.

అనంతరం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఏవో అరుణ్ కుమార్ తో రైతులతో కలిసి తిలకించారు.ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, కొప్పుల రాంబాబు, సురభి రాజేష్, మడకం శ్రీనివాస్, ఏఈఓ రమేష్ రైతులు తన్నీరు చిన్న పుల్లయ్య, పెద్ద బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Congress leaders participating in

You cannot copy content of this page

Scroll to Top