జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత పిన్ని మమతనే చిన్నారి హితీక్ష (5)ను హతమార్చినట్లు సీపీటీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. తోడికోడలు మీద కోపంతోనే మమత ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఆడుకుందామని చెప్పి చిన్నారిని బాత్రూంకు తీసుకెళ్లిన మమత కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం ఏం తెలియనట్లు కుటుంబ సభ్యులతో కలిసి ఏడ్చింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


