ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ ఇంచార్జ్ కోర్ర చందు నాయక్.
దేవరకొండ డివిజన్ ఫిబ్రవరి 19 , త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణం కొండమల్లేపల్లిలో పాత ఊరు హనుమాన్ నగర్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ అంగరంగ వైభవంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది
అనంతరం జనసేన పార్టీ నాయకులు కొత్తగొల్ల నరేష్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ మహారాజ్ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా విగ్రహముతో ర్యాలీ ఘనంగా ఆటపాట డప్పులతో భారీ ర్యాలీ నిర్వహించుకుంటామని , చత్రపతి శివాజీ లాగా ప్రతి ఒక్కరు ఎదురు తిరిగి మన ధర్మాన్ని మన దేశ భవిష్యత్తును కాపాడుతూ ఉండాలని కోరుతున్నాను అని అన్నారు .
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చందు నాయక్ విచ్చేసినందుకు వారికి హిందూ సాంప్రదాయంగా శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు* ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు బోడ కృష్ణ, కంటి వైద్యులు శివకుమార్, బచ్చు నారాయణ, బచ్చు ఆంజనేయులు జనసేన పార్టీ నాయకులు కార్తీక్, శరత్, తాళ్ల గోపి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


