Changed Weather : మారిపోయిన వాతావరణం

TRINETHRAM NEWS

Trinethram News : Telangana : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

గురువారం ఉదయం ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకొని ఈదురుగాలులు వీస్తున్నాయి.

దీంతో ఎండకు, ఉక్కపోతకు అల్లాడిన జనాలు వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం పొందుతున్నారు.

కానీ రైతులు ఆకాశంలో మబ్బులు చూసి వర్షాలుపడితే పంటపొలాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.

వాతావరణశాఖ ఈనెల 21 నుంచి ఉరుములు మెరుపులతో అక్కడక్కడ వర్షాలు పడతాయని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Changed weather

You cannot copy content of this page

Scroll to Top