త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం.. మొంథా తుఫాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఎస్పీ.రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు డి.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది.అశ్వారావుపేట లో రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి నుండి కురుస్తున్న, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు,వంకలు పొంగి పోయే ప్రాంతాలను డి.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది తో అశ్వారావుపేట సి.ఐ, పి.నాగరాజు, ఎస్సై.యయాతి రాజు, మరియు సిబ్బంది తో పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తుఫాన్ నేపథ్యంలో, ప్రజలందరూ జాగ్రత్తలు పాటించవలసిందిగా సూచనలు చేశారు. మరియు ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే పోలీసు కు సమాచారం అందించవలసిందిగా సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


