WhatsApp Image 2024 03 15 at 14.27.55
Trinethram News : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తం గా వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించబడే వార్షిక కళ్యాణోత్సవాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాద్ ఆచార్యులు శుక్రవారం తెలియజేశారు.
స్వామివారి ఉత్సవ కార్యక్రమంలో సంబంధించి ఆయన వివరాలు అందజేశారు.
19వ తేదీ మంగళవారం సాయంత్రం విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనము రిత్విక్ వరుణ కంకణ ధారణ అంతరాలయ పూజ నిర్వహించిన అనంతరం శ్రీ సుదర్శన పెరుమాళ్ వారిని పల్లకీలో వేంచేపు చేసి తిరువీధి సేవతో మృత్సం గ్రహణం కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. అనంతరం నిత్య సేవా కాలములు ప్రసాద్ నివేదనలో తీర్థ గోష్టి అనంతరం శ్రీదేవి భూదేవి సమేత కల్కి వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై అధిష్టింపజేసి గ్రామ తిరువీధి సేవ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తరువాత ఆలయం లో గల వార్షిక కళ్యాణ మండపంలో స్వామి వార్లను వేంచేపు చేసి అంకురార్పణ అగ్న
