తెలుగు నూతన సంవత్సరానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

TRINETHRAM NEWS

Trinethram News : APSRTC : బెంగళూరు మరియు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉగాది పండుగకు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ (ATM) రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 5, 6 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాధారణ ఛార్జీలకే ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. విజయవాడ, నెల్లూరు, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలకు బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top