డిండి(గుండ్ల పల్లి) ఆగష్టు 28 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ కుటుంబ ప్రయోజన(ఎన్ ఎఫ్ బీ ఎస్. )క్రింద దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద18 సంవత్సరాలనుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు కుటుంబం పెద్ద మరణించి నట్లయితే బాధిత మహిళాకుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.
ఏప్రిల్ 01 – 2017 తర్వాత కుటుంబ పెద్ద మరణించివున్నవారు ఈ పథకానికి అర్హులు. 30/08/2025 శనివారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజు, సంబంధిత గ్రామ పంచాయతీ లో గాని, తహశీల్దార్ కార్యాలయం గుండ్లపల్లి లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కావున ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
జత చేయవలసిన పత్రాలు
1 మరణ ధ్రువీకరణ పత్రం
2 ఆధార్ కార్డు
3 రేషన్ కార్డు
4 బ్యాంకు పాసు పుస్తకం
5 ఆదాయ ధ్రువీకరణ పత్రం
ఈ పత్రాలను జతపరచాలని డిండి మండల తహశీల్దార్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


