Festival for Farmers : ఆంధ్ర ప్రదేశ్ రైతులకు మరో పండగ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: నవంబరు:19 నెల్లూరు జిల్లా: కావాలి నియోజకవర్గం. బుధవారంరోజున భారతీయ జనతా పార్టీ పట్టణ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 21 విడత పిఎం కిసాన్ 2000 రూపాయలు కోయంబత్తూర్ లో విడుదల చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నేడు రెండో విడత నిధులు 5000 నిధులు విడుదల చేయటం జరిగింది.

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రెండు నిధులు కలిపి ఈరోజు అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం 7000 అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ జరిగింది. అన్నదాతల కుటుంబాల్లో ఆనందమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం రాష్ట్రంలో 46,85,838 రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం 21వ విడత 972 కోట్ల రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం 2342.92 కోట్లు జమ చేయడం జరిగింది. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ రైతు పక్షపాతిగా పనిచేస్తూ రైతాంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు పోతున్నాయి రైతులకు వివిధ రకాల యంత్ర సామాగ్రిని మరియు ఎరువులను మరియు పశువుల దానాలు రైతులకి సబ్సిడీ కింద అందించి అటు పశుపోషణకు మరియు రైతాంగం అధిక దిగుబడి సాధించటానికి రైతులు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతాంగం నష్టపోకుండా పసల్ బీమా ఈ క్రాప్ ద్వారా నేడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి.

రైతాంగం యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి గా భావించి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకుతీసుకుపోతున్నాయని వివరించడమైనది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్ కుమార్ , రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు పర్సు వెంకటేశ్వర్లు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జిల్లా టెలికం బోర్డ్ సభ్యులు కుట్టు పోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ రైతాంగం యొక్క ప్రేయసి ఓటమి ప్రభుత్వం యొక్క ధ్యేయమని రైతాంగాన్ని అన్ని విధాల ఓటమి ప్రభుత్వం అండగా ఉంటుందనితెలియజేయడమైనది
ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రాకేష్ పట్టణ ఉపాధ్యక్షులు కోడూరు మురళీకృష్ణ తదితర భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another festival for Andhra Pradesh farmers

You cannot copy content of this page

Scroll to Top