జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 05 at 19.25.54

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:మార్చి 05
చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య,ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.

మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కాలె యాదయ్య మార్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు.

తన నియోజకవర్గం అభి వృద్ధిపై సీఎం రేవంత్ తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.ఇటీవల భద్రాచలం బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు.

వీరితోపాటు సీఎం రేవంత్ ను కలిసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సునితా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్ లు ఉన్నారు.

దీంతో వీరంతా బిఆర్ఎస్ రాజీనామా చేసి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరబోతు న్నట్లు ప్రచారం కూడా జరుగిన సంగతి తెలిసిందే…

You cannot copy content of this page