అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శించిన ఆదివాసి జె ఏ సి సభ్యులు

TRINETHRAM NEWS

అగ్ని ప్రమాద బాధితులకు పరామర్శించిన ఆదివాసి జె ఏ సి సభ్యులు.

అరకు లోయ/జనవరి 03.త్రినేత్రం న్యూస్:

పెదలబుడు మాజీ ఉప సర్పంచ్ కిల్లో.సత్యనందం, అబ్బాయి, కీల్లో.పవన్ కుమార్ అగ్ని ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరిన విషయాన్ని తెలుసుకునీ ,ఆస్పత్రి కీచేరుకొని కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కుమార్ యొక్క ఆరోగ్య పరిస్థితినీ, మరియు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకొని పవన్ కుమార్ నీ మనో ధైర్యానిచ్చి త్వరగా ఆరోగ్య ప్రయోజనం కలగాలని, నొప్పి నుంచి ఉపశమనం పొందాలనీ.ఈ క్లిష్ట సమయంలో పూర్తి బలహీనతతో ఎదుర్కొనే శక్తి లభించాలనీ. ఎలాంటి సహాయం అవసరమైనా మేమంతా మీకు తోడుగా ఉంటామనీ భరోసా ఇచ్చారు.
పరామర్శించిన వారిలో సమర్ది గోపాలరావు తో పాటు అరకువేలి జే ఏ సి టీం బృందం తంగుల రాందాస్ , కో- కన్వీనర్లు ఆనంద్ , ఎల్ .మహదేవ్, కే.బుద్దు జనసేన మండల అధ్యక్షుడు అల్లంగి రామకృష్ణ తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top