జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 30 at 11.05.50 AM

TRINETHRAM NEWS

ఈరోజు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) డైరెక్టర్ శ్రీమతి దాసరి హరిచందన ఐఏఎస్ గారు,అడిషనల్ డెరైక్టర్ జాన్ శాంసన్ గారు,గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారు,కమిషనర్ రామకృష్ణారావు గారితో కలిసి బాచుపల్లి 15,17,మరియు 19వ డివిజన్ల పరిధిలో ప్రజా పాలన అభయహస్తం ధరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి పర్యవేక్షించడం జరిగింది.ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను సందర్శించి,దరఖాస్తు దారులతో ముచ్చటించి,అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు లబ్ది చేకూరేలా కృషి చేయాలని,ప్రజా పాలన కేంద్రాలకు వచ్చే ప్రజలకు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు,సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు గాజుల సుజాత,ఆగం రాజు ముదిరాజ్,NMC అధికారులు మేనేజర్ చంద్ర ప్రకాష్, సుకృత,ఇతర అధికారులు, సిబ్బంది,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page