తేదీ : 25/05/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ జిల్లా, తగరపు వలసలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సుమారు ఇరవై మీటర్ల వరకు ఆమెను ఈడ్చ కెళ్ళింది. తల నుజ్జు నుజ్జు కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి ని ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం, ఎర్ర వారి గుడానికి చెందిన ఉప్పలపాటి. తిరుమలా దేవి(24) గుర్తించడం జరిగింది. ఆమె భీమిలి లోని దివిస్ లేబో రేటరీసు లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


