ఫిలింనగర్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య?

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్:జనవరి 15
హైదరాబాద్ ఫిలింనగర్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇటీవల యూకె నుంచి హైదరాబాద్ కు వచ్చిన గౌస్ మొయినుద్దీన్ పై కొందరు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఈరోజు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు.

వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు..

You cannot copy content of this page

Scroll to Top