గోశాలకు పశుగ్రాసం అందజేసిన దంపతులు

TRINETHRAM NEWS

గోశాలకు పశుగ్రాసం అందజేసిన దంపతులు

పెద్దపల్లి జిల్లా డిసెంబర్ 27
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని హరిహరసుత శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి చెందిన గోశాలకు పశుగ్రాసం అందజేశారు.

ధర్మారం గ్రామ వాస్తవ్యులు బండ లత-శరత్ కుమార్‌ దంపతుల కూతురు సంహిత జన్మదినం సందర్భంగా 1 ట్రాక్టర్ పశుగ్రాసాన్ని బుధవారం అందజేశారు.

ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ తాటిపెళ్లి ఈశ్వర్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top