Murder Case : సంగెమ్ సంతోష్ ని హత్య చేసిన కుర్వ శ్రీనివాస్ పై హత్యయత్నం కేసు నమోదు చేయాలి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. తాండూర్ పట్టణం లోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో జెగ్గమ్మ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.ఈ సందర్బంగా కేవీపీస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ..తాండూర్ మండలం కోట బాస్ పల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ కులానికి చెందిన జగ్గమ్మని 12 సంవత్సరాల క్రితం హజిపూర్ గ్రామానికి చెందిన సంగం సంతోషం కి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది.వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.

కూతురు నందిని, నందకిషోర్ నాని వీరు కుటుంబ సమ్మెతంగా బ్రతుకుతెరువు కోసం కోట బాస్ పల్లి గ్రామానికి వెళ్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.కోట బాస్ పల్లి గ్రామానికి చెందిన కుర్వ శ్రీనివాస్ దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా/పాలేరు పని చేస్తూ ఉన్నాడు.సంగెమ్ సంతోష్ ని మరియు అతని భార్యను కుర్వ శ్రీనివాస్ అనునిత్యం వేదిస్తూ మీ భర్త సంగీమ్ సంతోష్ ని చంపుతానని బెదిరిస్తు భయబ్రాంతులకి గురించేస్తూ ఉండేవాడు మీ యొక్క భర్త అప్పు చేసిన డబ్బులు ఇవ్వడం లేదు అని అదే సాకుతో జెగ్గమ్మను లొంగతీసుకొని శారీరకంగా వాడుకొవడం జరిగింది.

నిన్న కోట బాస్ పల్లి గ్రామానికి చెందిన కుర్వ శ్రీనివాస్ హత్య చేసి హత్మ హత్యగా చిత్రికరించడం జరిగింది.తక్షణమే పోలీస్ అధికారులు కురువ శ్రీనివాస్ పై అత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది.అదేవిధంగా జగ్గమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆడుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది*

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A case of attempt to murder should be registered against Kurva Srinivas,

You cannot copy content of this page

Scroll to Top