జూలై 5, 2026
TRINETHRAM NEWS
Road accident on the Yarnagudem

Road Accident : త్రినేత్రం న్యూస్ : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిలో తెల్లవారుజామున 3.30 గబటలకు రోడ్డు ప్రమాదం… శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి విజయవాడ 40 మంది ప్రయాణికులతో వెళుతున్న శ్రీ వెంకటరమణ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ను ఢీకొట్టిన టిప్పర్ లారీ..

బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు ఒకరు మృతి.. పదిమందికి గాయాలు… క్షతగాత్రులను గోపాలపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలింపు.. మృతుడు రాజాంలోని పనసల వలస ప్రాంతానికి చెందిన నారు సాయిఅనిల్ కుమార్ (24)గా గుర్తింపు…

లారీ, బస్సు డ్రైవర్ల పరిస్థితి విషమం… లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్న ప్రయాణికులు… ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న దేవరపల్లి పోలీసులు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page