
Minister Responds to Gas Shortage : త్రినేత్రం న్యూస్ : Mar 14, 2026, తెలంగాణ : రాష్ట్రంలో ప్రజలు భయంతో గ్యాస్ సిలిండర్లను రెట్టింపు బుకింగ్ చేస్తున్నారని, గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదని, వాణిజ్య సిలిండర్ల కొరత ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమైన ఆయన, 810 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారని, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 1.3 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులు, దీపం పథకం కింద 28 లక్షల మంది వినియోగిస్తున్నారని, ప్రతి నెలా 60 లక్షల సిలిండర్లు వాడుతున్నారని పేర్కొన్నారు.

