Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడ్డ కులవర్ధన్(30) మృతిచెందాడు. జిల్లాలోని కురబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు.
స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. గంజాయికి అలవాటుపడిన కులవర్ధన్..
ఎదురింటిలో ఉండే బాలికను అత్యాచారం చేసి, నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. దీంతో నిందితుడిని అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


