సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చి రెడ్డి
డిండి( గుండ్ల పల్లి) జనవరి 26 త్రినేత్రం న్యూస్. భారత రాజ్యాంగ పలాలు ప్రతి పేదవాడి దరి చేరాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి అన్నారు.
సోమవారం 77వ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా డిండిలోని సిపిఐ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన జాతీయ జెండాను సీనియర్ నాయకులు బొడ్డుపల్లి వెంకటరమణ ఎగరవేశారు ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా మేరగాలని భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని భారతదేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా జనవరి 26ను జరుపుకోవడం దేశ ప్రజలకు పండగ రోజని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీ రామదాసు కనకాచారి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి. మైనోద్దీన్,మండల సహాయ కార్యదర్శి బొల్లె శైలేష్,కార్యవర్గ సభ్యులు నూనె వెంకటేశ్వర్లు,ఎనమల్ల నవీన్,నాయకులు దుబ్బశ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


