Trinethram News : Jan 21, 2026, తెలంగాణ : సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గత ప్రభుత్వం 30 శాతం అధిక కేటాయింపులతో టెండర్లు అప్పగించిందని ఆరోపించారు.
బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎంతో అవినీతి జరిగినట్లు కవిత అన్నారని, ఆమె ప్రశ్నలకు ఆ పార్టీ నేతలు సమాధానం ఇవ్వలేదన్నారు. హిల్ట్ పాలసీలపైనా ఇలాగే ఆరోపణలు చేశారని, అసెంబ్లీలో చర్చ పెడితే బహిష్కరించి వెళ్లిపోయారని చెప్పారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


