త్రినేత్రం న్యూస్, తెలుగుదేశంపార్టీ అమలాపురం పార్లమెంట్ మెయిన్ కమిటీ కార్యదర్శి గా నియమితులైన పిల్లి మీనా శనివారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావునీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సంధర్బంగా తనపై నమ్మకంతో పార్లమెంట్ కమిటీ లో కార్యదర్శిగా నియమించినందుకు ఎమ్మెల్యే వేగుళ్ళ కు పుష్పగుచ్చం అందజేసి, దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండపేట మండల మాజీ అధ్యక్షులు యరగతపు బాబ్జి, ద్వారపూడి గ్రామశాఖ అధ్యక్షులు సత్తి సత్యనారాయణ, జెడ్.మేడపాడు సొసైటి చైర్మన్ సలాది బాలసుబ్రహ్మణ్యం, చింతా దొరబాబు, వర్రె వీరబాబు, కొవ్వల రాజు, దాట్ల కృష్ణంరాజు, సత్తింశెట్టి అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


