త్రినేత్రం న్యూస్, మండపేట, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా నియమితులైన సంధర్భంగా భూపతి రాజు ఈశ్వరరాజు వర్మ, రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య, సోమవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ కు పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గ్రంథాలయాలకు మంచి గుర్తింపును తీసుకువచ్చి, గ్రంధాలయాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, రాజోలు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


