తేదీ : 17/11/2025. అనకాపల్లి జిల్లా : (త్రినేత్రం న్యూస్); అచ్చుతాపురం మండలం, దుప్పితూరు భూ వివాదంలో శాసనసభ్యులు జోక్యం చేసుకున్నారన్న వార్తల నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే వ్యవహారాల్లోకి వెళ్ళద్దని మంత్రి నాదెండ్ల ద్వారా యలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను హెచ్చరించినట్లు సమాచారం అనవసర వ్యవహారాల్లో కలగ జేసుకుని పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించొద్దని పవన్ సూచించారని వివరణ తీసుకున్నట్లు తెలిసింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


