TRINETHRAM NEWS

వడ్డీ డబ్బులు ఇవ్వలేదని రాడ్లతో ఒక వ్యక్తి పై దాడి

హిరమండలం మండలంలోని శుభలాయి గ్రామంలో వడ్డీ డబ్బులు చెల్లించలేదని ఒక వ్యక్తిపై రాడ్లతో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.

శుభలాయి గ్రామానికి చెందిన నక్క రాము పై వడ్డీ డబ్బులు చెల్లించలేదని అదే గ్రామానికి చెందిన పిన్నింటి జగ్గయ్య, నగేష్ లు వడ్డీ డబ్బులు సరిగా కట్టడం లేదని గురువారం రాత్రి ఇనప రార్డులతో దాడి చేశారు.

బాధితుడు వెంటనే హిరమండలం పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా వెంటనే బాధితుడు ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని హిరమండలం ఎస్ఐ నారాయణస్వామి తెలిపారు.