గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్, రాజమండ్రి ప్రకాష్ నగర్,
త్రినేత్రం న్యూస్ అక్టోబర్ 27, అనపర్తి మాజి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు గౌతమ్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ రాజమహేంద్రవరం అధినేత డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి, జాతీయ స్థాయిలో గుర్తింపునందుకున్నారు. దేశంలోని జాతీయ స్థాయి వారపత్రిక “ద వీక్ ”( అక్టోబర్ 26, 2025 ఎడిషన్ ) ఫోకస్ హెల్త్ పేజీలో డాక్టర్ గౌతమ్ రెడ్డి బి. పి. ఎచ్.( బినిన్ ప్రోస్టేటిక్ హైపర్పేసియా) పై ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో, పురుషుల్లో సాధారణంగా కనిపించే, తరచుగా నిర్లక్ష్యం చేయబడే బి. పి. హెచ్. సమస్య, దాని కారణాలు, లక్షణాలు, ఆధునిక చికిత్స పద్ధతులు, మరియు ముందుగానే గుర్తించడం ముఖ్యమని డాక్టర్ గౌతంరెడ్డి స్పష్టంగా వివరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


